ఆంధ్ర లో రాజకీయం మంచి వేడి మీద ఉంది అని చెప్పడంలో సందేహపడనక్కరలేదు. మొన్నటివరకు పోలవరం రగిలించిన రాజకీయం తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొంత మంది నాయకులను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వేడి మంచి కాక మిధ ఉంది. అలాగే జగన్ మీద చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టడంలో వైయస్ఆర్సిపి ఫైర్ బ్రాండ్  ఎమ్మెల్యే అయిన రోజా ఎప్పుడు ముందుంటుంది.

ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రోజా ని ఎదుర్కొనడానికి ప్రముఖ హీరోయిన్ నటి వాణి విశ్వనాథ్ బరిలోకి దించుతున్నారు. ఈ క్రమంలో వాణి విశ్వనాథ్ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి మంచి ఆసక్తి కనపరుస్తున్నారు.

ఈ సందర్భంలో రోజాకు పోటీగా నగిరి నుంచి బరిలోకి దిగడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ వాణి విశ్వనాథ్ ఇప్పటికే ప్రకటించారు.అలేగే రోజా కూడా వాణి విశ్వనాథ్ పై పోటీకి సై అనేశారు. రాబోయే రాజకీయం  ఈ సినీతారల వ్యాఖ్యలకు నగరి వేదిక కాబోతోంది. 2019 ఎలక్షన్ లో సినిమా తారలు ఏపీ పాలిటిక్స్ లో కనువిందు చెయ్యబోతున్నారు. జీవిత రాజశేఖర్ కూడా రాజకేయాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక వారి వైపు నుంచీ ప్రచారాలు ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ నీ పవన్ కళ్యాణ్ నీ తెలుగుదేశం వాడితే మహేష్ బాబు ని లక్కురావాలి అనేది వైకాపా ప్లాన్.


మరింత సమాచారం తెలుసుకోండి: