హైదరాబాద్ లో ఓ కొత్త కుటుంబ వివాదం వార్తల్లోకి ఎక్కింది. తనను పట్టించుకోవడం లేదంటూ ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో పెద్ద వింత ఏమీ లేదు. కానీ.. తనను పట్టించుకోకపోవడానికి ఆమె చెబుతున్న కారణం మాత్రం షాకింగ్ గా ఉంది. భర్త స్వలింగ సంపర్కానికి అలవాటు పడి తనను నిర్లక్ష్యం చేస్తూ మానసికంగా శారీరకంగా హింసిస్తున్నాడాని ఆరోపిస్తూ ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Image result for నా భర్త గే

సైదాబాద్ మాతృశ్రీ కాలనీకి చెందిన దీపికాకు. జహీరాబాద్ కు చెందిన అరుణ స్కూల్, అరుణ బాయ్ డీఈడీ కళాశాల యజమాని అంకుష్ తో మూడేళ్లక్రితం పెళ్లయింది. పెళ్లయిన తొలిరోజు నుంచే అంకుష్ ఆమెకు దూరంగా ఉంటున్నాడట. అంతే కాదు.. చీటికీ మాటికి చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టాడట. పరువు కోసం దీపిక అవన్నీ భరించింది. నలుగురికీ చెబితే తన కుటుంబం పరువు పోతుందని భయపడింది.

ఐతే... ఈ మధ్యకాలంలో అంకుష్ కూకట్ పల్లి లో ప్లాట్ అద్దెకు తీసుకున్నాడట. కొందరు యువకులకు ఎరవేసి ఆ ఫ్లాట్ లో అబ్బాయిలతోనే రాసలీలలు కొనసాగిస్తున్నాడట. ఈ విషయం చాలా రోజులుగా సాగుతున్న దీపిక ఇటీవలే పసిగట్టింది. అంకుష్ ను గట్టిగా నిలదీసింది. దీంతో అంకుష్ ఆమెను చిత్రహింసలకు గురి చేసేడి వాడట. అంతే కాదు.. రాత్రి వేళలో కారులో తీసికెళ్లి ఔటర్ రింగు రోడ్లపై వదిలేసేవాడట.


క్రమంగా అతని ఆగడాలు హద్దుమీరడంతో భరించలేక తాను సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు దీపిక చెబుతోంది. హోమో సెక్సువల్‌కు అలవాటు పడి చిత్రహింసలకు గురిచేస్తున్న తన భర్త ను కఠినంగా శిక్షించాలని బాధితురాలు కోరుతోంది. ఇన్నాళ్లూ కుటుంబ పరువు పోతుందని ఉద్దేశంతో ఎవరికి చెప్పకుండా తనలో తాను కుమిలిపోయానని వాపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: