ఏం రా..నేను అధికార పార్టీ ఎమ్మెల్యే..మా దగ్గరే  టోల్ ఫీజు తీసుకుంటావా అని సిబ్బందిపై ఓ ఎమ్మెల్యే దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.   ఓ వైపు క్షమశిక్షణతో, ప్రజలకు జవాబుదారి తనంతో ఉండాలని పార్టీ అధినాయకుడు ఎన్నిసార్లు ఉపదేశించినా... చెవుటివాని ముందు శంఖం ఊదినట్లుగానే ఉంది. వివరాల్లోకి వెళితే..కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని రేణికుంట టోల్‌ప్లాజాలో చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ వీరంగం సృష్టించారు. తన వాహనాన్ని వరుసలో వెళ్లమని చెప్పినందుకు టోల్‌ సిబ్బందిపై ఆమె దాడికి పాల్పడ్డారు.

అంతటితో ఆగకుండా ఇద్దరిపై దాడికి పాల్పడ్డారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామం దగ్గర రాజీవ్ రహదారిపైగల టోల్‌ప్లాజా దగ్గర తమ వాహనాలకు టోల్ ఫీజు తీసుకోవద్దంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వద్దని వారిస్తున్న మరో వ్యక్తిపై గన్‌మెన్లు దాడి చేశారు. వారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ సెల్‌ఫోన్‌ లాక్కున్నారు.
Image result for toll plaza
దీనిపై టోల్‌సిబ్బంది స్థానిక ఎల్‌ఎండీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై టోల్‌సిబ్బంది స్థానిక ఎల్‌ఎండీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏసీపీ ఉషారాణి సిబ్బందితో సహా అక్కడికి చేరుకుని టోల్‌ సిబ్బందిని అడిగి వివరాలు సేకరించారు. కాగా... అక్కడ జరుగుతున్న తతంగాన్ని కొందరు సెల్‌ఫోన్లలో చిత్రీకరిస్తుండగా వారి మొబైల్స్‌ను ఎమ్మెల్యే బొడిగె శోభ దంపతులు, అనుచరులు లాక్కెళ్లారు.


మరింత సమాచారం తెలుసుకోండి: