ఈ మద్య టాలీవుడ్ లో మహానటులు ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు తెరకెక్కిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు దుమ్మురేపాయి. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరిట సినిమా తెరకెక్కించనున్నట్టు ప్రకటించి.. దర్శకుడు రాంగోపాల్ వర్మ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ తన తండ్రిపై ఓ సినిమా తీస్తున్నట్లుగా ..ఆ సినిమాకు తేజా దర్శకత్వం వహించబోతున్నట్లు తెలిపారు. సందిట్లో సడేమియాలా జయం మూవీస్ పతాకంపై కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకత్వంలో ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ చిత్రం ఆదర్శ గృహిణి అన్నది ఉపశీర్షిక. సిరిపురపు విజయభాస్కర్ సమర్పణలో జి.విజయకుమార్ గౌడ్ నిర్మిస్తున్నట్లు మరో ప్రకటన వచ్చింది.
అయితే కోట్లమంది తెలుగు ప్రజలకు ప్రియతమ నటుడు, నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి చరిత్రను తెలిపే ప్రయత్నమే ఈ సినిమా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వివరించారు. ఈ సినిమాపై పలు అభ్యంతరాలు తెలిపారు..ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి. అయితే కొన్ని రోజుల నుంచి లక్ష్మీ పార్వతి వర్సెస్ కేతిరెడ్డి మద్య పెద్ద యుద్దమే నడుస్తుంది. తాజాగా లక్ష్మీపార్వతి వ్యవహారమంతా తనకు తెలుసని 'లక్ష్మీస్ వీరగ్రంథం' చిత్ర దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ‘లక్ష్మీపార్వతిగారూ! చెప్పండి..ఎక్కడికి రమ్మంటారు? నువ్వు మాట్లాడిన మాటలకు నీ ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేసేందుకు సిద్ధమే. కానీ, అన్న ఎన్టీఆర్ గారి మీద ఉన్న ప్రేమ కారణంగా నేను ఆ పని చేయట్లేదు. ‘మద్రాసు నుంచి తమిళులు, తెలుగు వాళ్ల నన్ను తరిమేశారని’ మీడియా ద్వారా అసందర్భ ప్రేలాపనలు పేలుతున్నారు.
నన్ను తరిమేసే దమ్మూ ధైర్యం ఎవరికి వున్నాయి? నన్ను తమిళనాడు నుంచి తరిమేశారని అంటారా? ఇప్పుడు నేను తమిళనాడులోనే ఉన్నా. ఆర్కేనగర్ ఉపఎన్నిక కోసం వచ్చా..’ అంటూ లక్ష్మీ పార్వతిపై కేతిరెడ్డి మండిపడ్డారు. తాను దేనికైనా రెడీ అంటూ సవాల్ విసిరారు కేతిరెడ్డి.