ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ బ్రాండ్ అని అంటారు..ఏ చిన్న చాన్స్ దొరికినా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగు దేశం పార్టీ సభ్యులపై విరుచుకు పడతారు.  తాజాగా ఇప్పుడు ఎమ్మెల్యే రోజా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ని టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తుంది.  ఈ మద్య పవన్ కళ్యాన్ నాలుగు రోజల పాటు ఏపీలో పర్యటించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో విజయవాడ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో తన గుండు పై క్లారిటీ ఇచ్చారు. 
Image result for pawan kalyan gundu
గతంలో తనకు టిడిపి నేత పరిటాల రవి గుండు కొట్టించారని వార్తలు వచ్చాయని..అయితే తనకు గుండు కొట్టిస్తే ఊరుకునే మనిషినేనా..అంటూ ఆ సమయంలో తానే కాస్త చికాకుతో ఉండటంతో గుండు కొట్టించుకున్నానని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.  ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  ఆ తర్వాత ఏపి మంత్రి పరిటాల సునిత కూడా తన భర్త అలాంటి వారు కాదని..పవన్ కళ్యాన్ కి పరిటాల రవికి మద్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని చెప్పింది. 

తాజాగా పవన్ ‘గుండు’ పై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఓ ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ..పవన్ ని అప్పట్లో గుండు కొట్టించిన మాట వాస్తవమే అని..ఆ సమయంలో తాను టిడిపిలో ఉన్నానని..కాకపోతే దానికి నాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.
Image result for pawan kalyan gundu
అంతే కాదు పవన్ కళ్యాన్ కి టిడిపి 2014 లో కూడా గుండ కొట్టించారని..2019లో మళ్లీ అదే పని చేయడం ఖాయమని ఆమె సెటైర్ వేశారు. పవన్ కల్యాణ్ ఈ విషయం తెలుసుకుని టీడీపీతో జాగ్రత్తగా ఉంటే మేలని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: