ఏపీ సీఎం చంద్ర‌బాబును పొగ‌డ‌ని వారు అంటూ ఎవ‌రూ ఉండ‌రు అంటారు టీడీపీ నేత‌లు. ఆయ‌న చేస్తున్న అభివృద్ధి, ప‌డుతున్న క‌ష్టం చూసి విదేశాల నుంచి స్వ‌దేశం వ‌ర‌కు అంద‌రూ బాబుకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుంటార‌ని చెబుతుంటారు. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం అక్క‌ర్లేద‌న్న‌ది విశ్లేష‌కుల మాట. ఇక‌, తాజాగా బాబు అనుకోని వ‌ర్గం నుంచి కూడా భారీ ఎత్తున మ‌ద్ద‌తు ల‌భించింది. పొగ‌డ్త‌ల పూ మాల‌ల‌తో, మాట‌ల‌తో బాబును వారు ముంచెత్తారు. త‌మ ఓట్ల‌న్నీ బాబుకేన‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పుకొచ్చారు. బాబును కౌగిలించుకున్నంత ప‌నిచేసి ముద్దులు పెట్టినంత ఫీలింగ్ ఇచ్చారు. ఇంత‌కీ వారెవెరో తెల‌స్తే.. షాక్ అవ‌డం ఖాయం. విష‌యంలోకి వెళ్తే.. ఢిల్లీ నగర వీధుల్లో సీఎం చంద్రబాబును హిజ్రాలు కొనియాడారు. తాము పడుతున్న సమస్యలపై చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారని పొగడ్తలు గుప్పించారు. 

Image result for ap cm transgenders

ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ లో దేశ వ్యాప్తంగా ఉన్న హిజ్రాలు నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్న ట్రాన్స్‌జెండర్ 2016 బిల్లును వ్యతిరేకిస్తూ హిజ్రాలు పార్లమెంటు స్ట్రీట్‌లో ధర్నాచేశారు. హిజ్రాల జీవన శైలి పట్టించుకోకుండా ట్రాన్స్‌జెండర్ బిల్లు తయారు చేశారంటూ వారు వాపోయారు. హిజ్రాలకు విద్య, ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. హిజ్రాల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా బిల్లు రూపొందించారని, బిల్లు వల్ల తాము నష్టపోతామని స్నేహ, రేష్మ, దుర్గ అనే హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్‌జెండర్ బిల్లు వ్యతిరేకిస్తూ ఏపీ తెలంగాణ నుంచి ఢిల్లీ వచ్చిన వందలాది హిజ్రాలు ధర్నాలో పాల్గొన్నారు. 

Image result for ap cm transgenders

తెలంగాణ ప్రభుత్వం హిజ్రాల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ప్రభుత్వ తీరు వారు ఖండించారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల తరహాలో తెలంగాణ ప్రభుత్వం హిజ్రాలకు ఉద్యోగ అవకాశాలు జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ట్రాన్స్‌జెండర్ల విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు ఏపీలో సొంత గృహలను కూడా నిర్మిస్తున్నార‌ని గుర్తుచేశారు. 


ఏ రాష్ట్రం కూడా తమకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా న్యాయం చేయాలని స్నేహ, రేష్మ, దుర్గ విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్‌జెండర్ పాలసీకి ఏపీ కేబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. 18 ఏళ్లు పైబడిన ట్రాన్స్‌జెండర్లకు రూ. 1500 పెన్షన్ ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు ఇవ్వాలని తీర్మానం చేశారు. అంతేకాకుండా ఉపాధికల్పన కోసం వారికి నైపుణ్య శిక్షణ ఇప్పించాలని కేబినెట్ తీర్మానించింది. దీనిపైనే హిజ్రాలు బాబును పొగ‌డ్త‌లతో ముంచెత్తి.. పుష్ప మాల‌తో పుల‌కించేలా చేశారు. సో.. ద‌టీష్ బాబు గ్రేట్ నెస్‌!! 


మరింత సమాచారం తెలుసుకోండి: