అయినా తిరిగే కాలు, తిట్టే నోరు ఊరుకోదు కదా..బాబు కూడా దానికి మినహాయింపు కాదు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నాడు, చేనేత ఉత్సవం నిర్వహించారు. అసలు ఇలాంటి కీలక సమయంలో ఉత్సవాలేమిటో బాబుకే తెలియాలి. పోనీ అప్పుడైనా తన భావాలు స్వేచ్చగా వెల్లడించారా..అదీ లేదు.

అసలు విభజన, తెలంగాణా వంటి విషయాలు వదిలేసి, ఎప్పటిలాగే కాంగ్రెస్, దాని వ్వవహారాలు, రాష్ట్రాభివృద్ధి గురించి ఫ్రసంగం దంచేసారు. ఎప్పటిలాగే తెలుగుదేశం అధికారంలోకి వస్తే తప్ప రాష్ట్రం బాగుపడదని ముక్తాయించారు. ఏమిటో బాబు..నేను మారాను..మారాను అనడమే కానీ, నిజంగా ఎప్పుడు మారతారో..

మరింత సమాచారం తెలుసుకోండి: