తెలంగాణ వాదులకు విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ సవాల్ చేస్తున్నారు.తాను మాట తప్పబోనని అంటూ ,రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని,విబజన జరగకపోతే విభజన వాదులు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ఆయన సవాల్ చేశారు. అదే మాటకు కట్టుబడి ఉంటానని సమైక్యతతోనే తన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందని, విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం ముమ్మాటికీ తప్పే అని ఆయన చెప్పారు. అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై చర్య తీసుకోవడం మొదలైతే మొత్తం పార్టీ ఖాళీ అవుతుందని ఆయన అన్నారు.లగడపాటి తన రాజకీయ సన్యాసం నిర్ణయాన్ని తనంతటతాను ప్రకటించారు.అందువల్ల ఆయన సవాల్ ను ఎవరు స్వీకరిస్తారు?

మరింత సమాచారం తెలుసుకోండి: