నిజామాబాద్ జిల్లా శివారులో దారుణం జరిగింది. బుధవారం రాత్రి అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు దారుణ హత్యకు గురయ్యారు. కంటేశ్వర్ ప్రాంతంలోని గంగస్థాన్-ఫేజ్3 వద్ద సిరి, అక్షయ, శృతిల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరి సమీప బంధువు నరేందర్‌రెడ్డి ముగ్గురు చిన్నారులను హత్య చేసి అనంతరం వారిని దహనం చేసినట్లు తెలుస్తోంది. రెంజల్ మండలం దూపల్లికి చెందిన మాజీ ఎంపీపీ రఘుపతిరెడ్డి కుటుంబసభ్యులు ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చారు.  అయితే నిన్న సాయంత్రం ఆరుబయట అడుకుంటున్న ముగ్గురు చిన్నారులను సమీప బంధువు నరేందర్ రెడ్డి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు. అనంతరం రఘుపతికి ఫోన్ చేసిన నరేందర్‌రెడ్డి తానే ముగ్గురు చిన్నారులను కిడ్నాప్ చేసి, హత్య చేశానని, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులకు సమాచారం అందించటంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు నరేందర్‌రెడ్డి సెల్‌ఫోన్‌ను ట్యాప్ చేయగా బాసర బ్రిడ్జి దగ్గ ఆయన కారును గుర్తించారు. అయితే చిన్నారులను కూడా బ్రిడ్జిపై నుంచి కిందపడేసి, అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావించారు.  ఈ నేపథ్యంలో వారు గాలింపు చర్యలు చేపట్టగా గంగస్థాన్ ఫేజ్-3 వద్ద పూర్తిగా దహనమై ఉన్న ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభించాయి. నరేందర్‌రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు చిన్నారులు శవమై రావడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: