జేసీ దివాకర్ రెడ్డి కావాలా? లేక పరిటాల సునీత కావాలా? జేసీ దివాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవద్దు అంటే మీరు వినలేదు. ఆయనకు తోడు ఇప్పుడు పయ్యావుల కేశవ్, పార్ధసారధిలు తోడయ్యారు. పరిటాల వర్గం జిల్లాలో ఎక్కడా కనిపించ కూడదని ముఠాలు కడుతున్నారు. మీకు వారు కావాలా? నేను కావాలా? తేల్చుకోండి అని పరిటాల రవి సతీమణి పరిటాల సునీత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందు కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. జేసీ, పయ్యావుల కేశవ్ ల చర్యలను ఆమె తప్పుపట్టినట్లు తెలుస్తోంది. కదిరికి చెందిన టీడీపీ నేత కందికుంట వెంకట ప్రసాద్ తమ కుటుంబానికి చాలా సన్నిహితుడు అని.. ఇప్పుడు ఆయనకే టికెట్ రాకుండా బీజేపీ పొత్తులో భాగంగా ఆ పార్టీకి కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారని తెలుస్తుందని.. ఆయనకు టికెట్ రాకుంటే తాను కూడా ఎన్నికల్లో పోటీ చేయనని సునీత చంద్రబాబుతో తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. సునీత వ్యాఖ్యలతో ఖంగుతిన్న చంద్రబాబు వెంటనే బీజేపీ నేతలకు ఫోన్ చేసి కదిరి సీటు ఇవ్వడం కుదరదని చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి అనంతపురం జిల్లాలో జేసీ రాక పార్టీకి ఇబ్బందిగానే మిగులుతుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: