తెలుగుదేశం పార్టీ ప్రకటించిన రైతు రుణ మాఫీపై చాలమంది విమర్శలు చేస్తున్నారని, అది అసాధ్యమని కూడా అంటున్నారని కానీ లక్షల కోట్లు దోచుకున్నవైఎస్ జగన్మోహన్ రెడ్డిచేత అవినీతి సొమ్ము కక్కిస్తే రైతు రుణమాఫి ఒక్కసారేంటి, రెండుసార్లు చేయవచ్చునని నారా లోకేష్ మరోసారి జగన్ పై నిప్పులు చెరిగారు. ‘యువ ప్రభంజనం’ యాత్ర సందర్భంగా మాట్లాడుతూ, తన సభలకు వస్తున్న ప్రజలను చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమనిపిస్తుందని లోకేష్ చెప్పుకొచ్చారు.  రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్తితులను అధిగమించాలంటే, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావాలంటే టీడీపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేవలం మూడు వారాల్లో టీడీపీ అధికారంలోకి రాబోతుందని, ఆ యువనాయకుడు దోచుకున్న అవినీతి సొమ్మును కక్కిద్దామని జగన్‌ను ఉద్దేశించి లోకేష్ నాయుడు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లాంటి నగరాలు ఇదు నిర్మించాలంటే అది చంద్రబాబుకే సాధ్యమని లోకేష్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: