ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందుపూర్ లో పోటీచేస్తుండడంతో తెలుగుదేశం ప్రభంజనం వస్తుందని టిడిపి నేత, ధర్మవరం అభ్యర్ధి వరదాపురం సూరి అన్నారు.బాలకృష్ణ హిందుపూర్ లో నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. బాలకృష్ణ ప్రభావం జిల్లా మొత్తం మీద ఉండి అన్ని సీట్లు గెలుస్తామని టిడిపి నేతలు చెబుతున్నారు.కాగా ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈసారి పెనుకొండ నుంచి పోటీచేస్తున్నారు.ఆయన కూడా నామినేషన్ దాఖలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: