వైకాపా రాష్ట్ర అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పెనుకొండలో నిర్వహించిన జనభేరి సభకు వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి నీరాజనం పలికా రు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి శ్రీధర్‌ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్‌నారాయణకు మద్దతుగా పట్టణం లోని అంబేద్కర్‌ సర్కిల్‌లో వైకాపా నాయ కులు జగన్‌మోహన్‌రెడ్డి వారికి ఓట్లు వేసి గెలిపించాల న్నారు. తమ ప్రియతమ నాయకుడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి పథకాలే తమకు శ్రీరామరక్ష అన్నారు. అదేవిధంగా 108, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయన్నారు. అంబేద్కర్‌ సర్కిల్‌లో రోడ్డుకిరువైపులా పెద్ద సంఖ్యలో మహిళలు, నాయకులు, కార్యకర్తల వద్దకు జగన్‌ వెళ్లి ఆప్యాయతగా పలుకరిస్తూ.. సార్వత్రిక ఎన్నిక ల్లో వైకాపాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్‌నారాయణ మాట్లాడుతూ దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో ప్రజలకు ఎంతో మేలు చేశాయన్నారు. కావున ప్రజలు తమ అ మూల్యమైన ఓటును ఫ్యాన్‌ గుర్తుకు వేయాలని అభ్యర్థించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: