టీడీపీ లో అంతర్గంగా కలహాలు మొదలయ్యాయి. రానున్న ఎన్నికల్లో కొత్తగా ఆ పార్టీ లో చేరిన వారికే టికెట్లు కేటాయిస్తుండంతో పాత నేతలు ఆ విషయం వంటబట్టడం లేదు. టీడీపీ లో సీనియర్ నేత గా ఉన్న సిఎం రమేష్ కూడా టికెట్ల విషయంలో తీవ్ర అసంతృప్తి తో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి వచ్చిన చాలా మందికి టికెట్లు కేటాయించడం, 10 సంవత్సరాలుగా పార్టీనే అంటి పెట్టుకొని ఉన్నవారికి టికెట్లు కేటాయించక పోవటం వంటి అంశాలు ఆయన కు రుచించలేదు.  అంతేకాకుండా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ టికెట్ల కోసం డబ్బులు కూడా తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సిఎం రమేష్ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తో కలిసి టీడీపీని దెబ్బ తీయాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారిద్దరి మధ్య ఓ రహస్య ఒప్పందం కూడా జరిగినట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి స్దాపించిన ప్రజారాజ్యం లో కూడా డబ్బున్న వారికే టికెట్లు కేటాయించుకొని ఓటమిని చవిచూసినట్లు గానే, ఈ సారి టీడీపీకి అలాంటి పరిస్దితే ఎదురయ్యేలా ఉండాలని సిఎం రమేష్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: