బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్ది నరేంద్ర మోడీ జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తారు. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ లలో జరిగిన బహిరంగ సభలలో పాల్గొన్న మోడీ చివరగా హైదరబాద్ లోని ఎల్బీ స్టేడియం లో జరిగిన భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లతో కలిసి వేదికను ఆయన పంచుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన, తెలుగు జాతి ఆత్మ క్షోభను పవన్ కళ్ళలో చూశానని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోయినా తెలుగు వారంతా కూడా ఒక్కటిగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు స్పష్టం చేసిన మోడీ పవన్ లాంటి యువకులు తెలుగుజాతికి ఎంతో అవసరం అని అన్నారు. అంతకముందు చంద్రబాబు నాయుడు, పవన్ లు ప్రసంగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: