విశాఖ జిల్లా నర్సీపట్నంలో కాంగ్రెస్ అభ్యర్ధి అప్పలనాయుడు కూడా తన నామినేషన్ ను విరమించుకుని కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టాడు. నామినేషన్ గడువు ముగుస్తుండగా ఆయన అరగంట ముందు తన తమ్ముడిద్వారా ఉపసంహరణ లేఖ పంపించారు. రిటర్నింగ్ అధికారి స్వయంగా అప్పల్నాయుడుతో ఫోన్‌లోమాట్లాడిన తర్వాతే ఆయన నామినేషన్ ఉపసంహరణ లేఖను ఆమోదించారు. అనారోగ్యంవల్లే పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు అప్పల్నాయుడు చెబుతుంటే, ప్రత్యర్ది పార్టీలకు అమ్ముడుపోయారని డిసిసి అధ్యక్షుడు ఆరోపించారు.కాగా పదేళ్లపాటు అదికారంలో ఉన్న పార్టీ అభ్యర్ధులు ఇలా రెండు చోట్ల విరమించుకోవడం విశేషం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కూడా కాంగ్రెస్ అభ్యర్ధి ఉపసంహరించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: