వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకురాలు ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి ఇంకా కోమాలోనే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శోభాను చూసేందుకు పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా తరలి వస్తున్నారు అర్ధరాత్రి ప్రయాణాలు వద్దని వేగంగా వెళ్లవద్దని నన్నపనేని సూచించారు. శోభా కుటుంబం తమ కుటుంబానికి చాలా సన్నిహితులన్నారు. ఆమెకు క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆళ్లగడ్డ నుండి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. రాజమండ్రి ప్రచారంలో ఉన్న వైయస్ విజయమ్మగుంటూరు జిల్లా ప్రచారంలో ఉన్న వైయస్ జగన్ తెలంగాణ ప్రచారంలో ఉన్న షర్మిలలు హైదరాబాదుకు బయలుదేరారు. వారు తమ ప్రచారాన్ని అర్ధాంతరంగా ఆపివేశారు జగన్ కేర్ ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేశారు. ఆయన ఎప్పటికప్పుడు ఫోన్లో వైద్యుల నుండి సమాచారం తెలుసుకుంటున్నారు. ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదని ఆమె ఆరోగ్యం బాగుపడేలా చూడాలని జగన్ వైద్యులకు సూచించారు. హైదరాబాద్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకురాలు ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి ఇంకా కోమాలోనే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శోభాను చూసేందుకు పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా తరలి వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి ఆసుపత్రికి వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: