ఉత్తరప్రదేశ్ దగ్గర పెద్ద రైలు ప్రమాదం జరిగింది. సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ ను గోరఖ్ ధామ్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయారు. మరో 50 మందికి గాయాలయ్యాయి. ఉదయం 11 ప్రాంతంలో రైలు ప్రమాదం జరిగిందని సమాచారం. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. రెండు రైళ్ళు గుద్దుకోవడంతో ఒక ఏసీ, స్లీపర్, నాలుగు జనరల్ బోగీలు పట్టాలు తప్పాయి. గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ గోరఖ్ ధామ్ నుంచి ఢిల్లీ బయలుదేరింది. రైలు బోగీలు గాల్లోకి లేవడం వల్ల ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగాను ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి ప్రజలు సహాయక చర్యలు చేపట్టారు. అధికారులు సైతం ప్రమాదస్థలికి వెంటనే చేరుకున్నారు. బోగీలు ఒకదానిపైకొకటి ఎక్కేయడంతో మృతులను, క్షతగాత్రులను బయటకు వెలికితీయడం చాలా కష్టంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: