రిలయన్స్ కుటుంబానికి చెందిన అనిల్ అంబానీ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఆంద్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు సంబందించిన అంశాలపై అంబాని చర్చించారని చెబుతున్నారు.అయితే ఏ తరహా పరిశ్రమలు పెట్టడానికి అనిల్ అంబాని వచ్చారన్నది తెలియవలసి ఉంది. ప్రత్యేకంగా కమ్యూనికేషన్ రంగంలో అనిల్ కు ఎక్కువ ఆసక్తి ఉన్నందున అటువైపు ఏమైనా పరిశ్రమలు పెట్టడానికి అంబానీ ముందుకు వచ్చారా అన్న చర్చ జరుగుతోంది.కాగా జి.ఎమ్‌.ఆర్.ప్రతినిధులు కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు.శంషాబాద్ విమానాశ్రయం నిర్మించిన జి.ఎమ్.ఆర్.సంస్థ ద్వారా ఆంద్రలో కూడా విమానాశ్రయాల అభివృద్ది ఇతర పరిశ్రమల విషయంలో చర్చలు జరిపి ఉండవచ్చని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: