2014-15 ఆదాయం అంచనా రూ. 1,64,000 కోట్లు. * ఛార్జీల పెంపుతో రూ. 8 వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది. * అన్ని ప్రధాన స్టేషన్లలో లిఫ్ట్ లు, ఎస్కలేటర్లు. * వృద్ధులు, వికలాంగుల కోసం రైల్వే స్టేషన్లలో బ్యాటరీ వాహనాలు. * స్టేషన్లలో శుభ్రతను పరిశీలించేందుకు సీసీటీవీలు. * ప్రధాన రైళ్లలో ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సౌకర్యాలు. * సీటు, బెర్త్ మాత్రమే కాకుండా... కోచ్, రైలును కూడా బుక్ చేసుకునే అవకాశం. * డబ్లింగ్, ట్రిప్లింగ్ లకు మొదటి ప్రాధాన్యత. * కొత్త రైల్వే లైన్లకు రెండో ప్రాధాన్యత. * ప్రైవేటు భాగస్వామ్యంతో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత.  * 50 మేజర్ స్టేషన్లలో ఔట్ సోర్సింగ్ విధానంలో పారిశుధ్యత కార్యక్రమాలు. * ఆర్పీఎఫ్ సిబ్బందికి మొబైల్ ఫోన్లు. * రైల్వే సిబ్బంది సంక్షేమ నిధి రూ. 500 కోట్ల నుంచి రే. 800 కోట్లకు పెంపు. * త్వరలోనే ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు. * రూ. 100 కోట్లతో ప్రధాన నగరాల మధ్య హైస్పీడ్ నెట్ వర్క్ ఏర్పాటు. * భద్రత కోసం త్వరలోనే 17000 ఆర్పీఎఫ్ సిబ్బంది. * కాపలా లేని 5400 రైల్వే లెవెల్ క్రాసింగ్ ల మూసివేత. * రైళ్లలో మహిళల భద్రత కోసం 4వేల మంది మహిళా కానిస్టేబుళ్ల నియామకం. * రైల్వే యూనివర్శిటీ నిర్మించడానికి యత్నాలు. * ఆన్ లైన్ ద్వారా ప్రయాణ, ప్లాట్ ఫాం టికెట్ల విక్రయం.  * ఐదేళ్లలో పేపర్ లెస్ కార్యాలయాలు. * పార్కింగ్, ప్లాట్ ఫాం కాంబో టికెట్ల విక్రయాలు. * విమానాశ్రయాల స్థాయిలో ప్రధాన రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ. * ఎంపిక చేసిన రూట్లలో రైళ్ల వేగం గంటకు 160-200 కి.మీటరకు పెంపు. * 10 మెట్రో స్టేషన్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాం. * ఎ-1 స్టేషన్లు, ఎ-1 రైళ్లలో వైఫై సౌకర్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: