రాజధాని నగరంలో మరోసారి దారుణం జరిగింది. ఓ యువతిని నలుగురు వ్యక్తులు మాల్ బయట నుంచి అపహరించి, ఆమెను కారులో తీసుకెళ్లి కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం చేసి.. తర్వాత రోడ్డుమీద విసిరేసి పోయారు. ఈ దారుణం ఢిల్లీ శివార్లలోని ఘజియాబాద్‑లో జరిగింది. మాల్‑లో పనిచేస్తున్న ఆ యువతి (22) తనపై అత్యాచారం చేసిన నలుగురి పేర్లను పోలీసులకు తెలిపింది. వారిలో ఒకరు ఆమె బోయ్‑ఫ్రెండు కావడం గమనార్హం. నిందితులతో ఒకరు మైనర్ అని పోలీసులు చెప్పారు. సామూహిక అత్యాచారం చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఆమెను నోయిడాలోని ఓ ఆస్పత్రి సమీపంలో రోడ్డుమీద విసిరేసి పోయారు. ఈ నలుగురిపైన ఆమె గతంలో కూడా తమకు ఫిర్యాదు చేసిందని, కేసును తాము దర్యాప్తు చేస్తున్నామని ఉత్తరప్రదేశ్ సీనియర్ పోలీసు అధికారి అతుల్ యాదవ్ తెలిపారు. అప్పుడే తనకు రక్షణ కావాలని కోరినా ఆమెను పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలి స్నేహితులు ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: