కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు.
జైట్లీ బడ్జెట్లోని ముఖ్యంశాలు:
* 2015 ద్రవ్యలోటు 3.6 శాతం
* ద్రవ్యలోటు 4.1 శాతానికి తీసుకు వస్తాం
* ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం,అధిక వృద్ధి రేటును పెంచడమే ఎన్డీయే ప్రధాన లక్ష్యం
* 7060 కోట్లతో 100 స్మార్ట్ సిటీలు
* ట్యాక్స్ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ
* తయారీ రంగంలో ఎఫ్డీఐలు అభివృద్ధికి ఆశాదీపాలు
* ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణకు రెండు యూనివర్శిటీలు
* పెట్టుబడుల కోసం స్నేహపూరిత విధానం
* ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి రూ. 50,548 కోట్లు.
* గ్రామాణ విద్యుదీకరణకు రూ. 500 కోట్లు.
* గ్రామీణ తాగునీటికి రూ. 6,500 కోట్లు.
* బాలికల సాధికారతకు రూ.100 కోట్లు.
* ఆడపిల్లలను చదివించండి, రక్షించండి పథకానికి రూ. 500 కోట్లు.
* మహిళల భద్రతకు రూ. 150 కోట్లతో పైలట్ ప్రాజెక్టు.
* అంధుల కోసం బ్రెయిలీ లిపిలో కరెన్సీ నోట్లు.
* సర్దార్ ఏక్తా విగ్రహానికి 200 కోట్లు
* గ్రామ్ జ్యోతి పథకానికి రూ.500 కోట్లు
* ఇందిరా వికాస్ పత్రాల ద్వారా పెట్టుబడుల
* బీమా రంగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది
* బీమా రంగంలో 49 శాతం ఎఫ్డీఐలకు కృషి
* ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2లక్షల కోట్ల పెట్టుబడులు
* సుస్థిరమైన పన్నుల వ్యవస్థకు రూపకల్పన
* 2008నాటి ఆర్థిక సంక్షోభం ప్రపంచంలోని ఎన్నో దేశాలతో పాటు భారత్ పై కూడా ప్రభావం చూపింది.
* పేదరికాన్ని నిర్మూలిస్తామన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తాం.
* ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా... పరిస్థితిని సమూలంగా చక్కదిద్దుతాం.
* గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న జాప్యాల వల్ల ఎన్నో అవకాశాలను కోల్పోయాం.
* ఈ బడ్జెట్ నుంచి అతిగా ఆశించవద్దు. ఈ బడ్జెట్ ను సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో రూపొందించాం.
* నల్లధనం సమస్యను పరిష్కరించాల్సి ఉంది.
* భవిష్యత్ తరాలకు అప్పును వారసత్వంగా ఇవ్వలేం.
* జీఎస్ టీ అమలుపై ఈ ఏడాదే నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రాలతో చర్చించి జీఎస్ టీ పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం.
* పెట్టుబడిదారులకు సానుకూల వాతావరణం ఏర్పాటుచేస్తాం.
* ఇన్స్యూరెన్స్ రంగంలో ఎఫ్ డీఐలను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుతాం.
* రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను 49 శాతానికి పెంచుతాం.
* పట్టణ నిర్మాణ రంగంలో ఎఫ్ డీఐలను అనుమతిస్తాం.
* కొత్త యూరియా విధానాన్ని ప్రవేశపెడతాం.
* పన్ను చెల్లింపుదారుల సమస్యల సరిష్కారం కోసం కమిషన్ ను నెలకొల్పుతాం.
* దేశంలో 100 స్మార్ట్ సిటీలను నెలకొల్పుతాం. వీటి కోసం రూ. 7060 కోట్లు వెచ్చిస్తాం.
* దేశంలోని 9 విమానాశ్రయాల్లో వీసా ఆన్ అరైవల్ విధానాన్ని అమలుచేస్తాం.
* గుజరాత్ లో నిర్మిస్తున్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి (సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం) రూ. 200 కోట్లు కేస్తాయిస్తున్నాం.
* బ్యాంకింగ్ రంగాన్న మరింత బలోపేతం చేస్తాం.
* కరెంటు ఖాతా లోటుపై నిరంతర నిఘా ఉంచుతాం.
* నిరంతర విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం.
* వ్యవసాయాభివృద్ధికి 'పీఎం కృషి సచార్' పథకానికి రూ. 1000 కోట్లు.
* 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ పథకం తీసుకువస్తాం.
* ఆహార,చమురు సబ్సిడీలపై దృష్టి సారిస్తాం.
* స్థూల జాతీయోత్పత్తి ఇంకా పెరగాలి.
* రాబోయే 3, 4 ఏళ్లలో 7 నుంచి 8 శాతం వద్ధిని ఆశిస్తున్నాం.
* పన్నుల వివాదాల వేగవంత పరిష్కారం దిశగా ట్రైబ్యునల్స్.
* బీమా రంగంలో ఎఫ్డీఐలు 26 శాతం నుంచి 49 శాతంకు పెంపు.
* రక్షణ రంగంలోనూ ఎఫ్డీఐలు 26 శాతం నుంచి 49 శాతంకు పెంపు.
* ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి నిలకడైన నిర్ణయాలే పునాది.
* వ్యయ నిర్వహణ సంస్థను కేంద్రం నియమిస్తుంది.
* వస్తు సేవల పన్నుపై చర్చకు ముగింపు పలకాలి.
* తయారి మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి రూ. 2.4 లక్షల కోట్లు.
* తక్కువ వ్యయంతో గృహ నిర్మాణం, ఎఫ్డీఐలకు ప్రోత్సాహం.
* నైపుణ్యాల పెంపునకు స్కిల్ ఇండియా కార్యక్రమం.
* 9 విమానాశ్రయాల్లో ఈ విసా సదుపాయం.
* బ్యాంకింగ్ వ్యవస్థకు మరింత స్వేచ్ఛ, జవాబుదారీతనం పెంపు.
* పెట్టుబడులకు స్నేహపూర్వక పన్నుల విధానం.
* ఆర్థిక వ్యవస్థకు నల్లధనం ప్రమాదకారిగా మారింది.
మరింత సమాచారం తెలుసుకోండి: