ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఉదయం 11 గంటలకు లోక్ సభలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి దేశ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అంతకు ముందు బడ్జెట్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. * ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధికి రూ.50వేల కోట్లు * 16 కొత్త నౌకాశ్రయాల అభివృద్ధి * ఫుడ్ కార్పొరేషన్ ఇండియాలో సంస్కరణలు * చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.200 కోట్లతో కార్ఫస్ ఫండ్ * భూసార పరీక్ష కేంద్రానికి రూ.56 కోట్లు * ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి * కృష్ణపట్నంలో ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు * విశాఖ నుంచి చెన్నై వరకూ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు * రైతుల కోసం కిసాన్ టెలివిజన్ ఛానల్ ఏర్పాటుకు రూ.100 కోట్లు * ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా జీఎస్టీ * సూరత్, రాయ్ బరేలీ, తమిళనాడులో టెక్స్ టైల్ పార్కులు * వాతావరణంలో అనూహ్య మార్పులను ఎదుర్కొనేందుకు రూ.100 కోట్లు * మూలధనం పెంపుకు జాతీయ బ్యాంకుల వాటా అమ్మకం * నాబార్డు ద్వారా 5లక్షల మంది భూమిలేని రైతులకు ఆర్థిక సాయం * తక్కువ ధరలకే ఇళ్లు నిర్మించేందుకు ప్రత్యేక చర్యలు * సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు ప్రోత్సాహాలు * ఆంధ్రప్రదేశ్, హర్యానాలో అగ్రికల్చరల్ యూనివర్సిటీలు * హార్డ్వేర్ తయారీ లక్ష్యంగా కాకినాడ పోర్టు అభివృద్ధి * 2022 నాటికి అందరికీ ఇళ్లు * గోదాముల కోసం రూ.5కోట్లు * తెలంగాణలో హార్టీకల్చర్ యూనివర్సిటీ * ఆన్ లైన్ విద్యా బోధనకు రూ.100 కోట్లు * గిరిజనుల వనబంధు పథకానికి రూ.100 కోట్లు * సర్వశిక్ష అభియాస్ కు రూ.28,635 కోట్లు * 2019 నాటికి పరిశుభ్ర భారత్ * సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి రూ.6000 కోట్లు * గ్రామీణ విద్యుద్దీకరణకు రూ.500 కోట్లు * మహిళల భద్రతకు రూ.150 కోట్లు * దశలవారీగా ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటు * పబ్లిక్ ట్రాన్స్ పోర్టుల్లో మహిళల భద్రతకు రూ.50 కోట్లతో పైలట్ ప్రాజెక్ట్ * యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్ ఇండియా కార్యక్రమం * మదర్సాల అభివృద్ధికి రూ.100 కోట్లు * ఈ-క్రాంతి పథకం ద్వారా గ్రామాల్లో ఇంటర్నెట్లకు 500 కోట్లు * కొత్తగా 12 వైద్య, దంత కళాశాలలు * కమ్యూనిటీ రేడియో స్టేషన్ల అభివృద్ధికి రూ.100 కోట్లు * నగరాల్లో మెట్రో పనుల కోసం రూ.100కోట్లు * ఈపీఎఫ్ వడ్డీరేట్లు పెంపు కోసం * బాలిక రక్షణ కోసం రూ.100 కోట్లు * వాటర్ షెడ్ ప్రోగ్సామ్స్ కి 2,142 కోట్లు * గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం రూ.3,600 కోట్లు * గృహ నిర్మాణ పథకానికి రూ.800 కోట్లు * ఎంపిక చేసిన రంగాల్లో ఎఫ్డీఐలకు ప్రోత్సహం * ఆంధ్రప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల్లో కొత్త ఐఐటీలు * గ్రామీణ రహదారుల అభివృద్ది కోసం 14,389 కోట్లు * గుజరాత్ తరహా పట్టణీకరణకు చర్యలు * ఎస్సీ, ఎస్టీ ప్రణాళికకు 50వేల కోట్లు * పెట్టుబడుల కోసం స్నేహపూరిత విధానం * సర్దార్ ఏక్తా విగ్రహానికి 200 కోట్లు * గ్రామ్ జ్యోతి పథకానికి రూ.500 కోట్లు * ఇందిరా వికాస్ పత్రాల ద్వారా పెట్టుబడుల * సుస్థిరమైన పన్నుల వ్యవస్థకు రూపకల్పన * ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు కఠిన చర్యలు * గృహ అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా * ప్రధానమంత్రి నీటిపారుదల పథకానికి వెయ్యి కోట్లు * వ్యయ-యాజమాన్య కమిషన్ ఏర్పాటు * పర్యాటక రంగం ప్రోత్సాహానికి 9 ఎయిర్ పోర్టుల్లో ఈ-వీసాలకు అనుమతి * త్వరలో కొత్త యూరియా పాలసీ * ఎనిమిది శాతం వృద్ధిరేటు లక్ష్యం * ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా లేవు * 7060 కోట్లతో 100 స్మార్ట్ సిటీలు * ట్యాక్స్ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ * తయారీ రంగంలో ఎఫ్డీఐలు అభివృద్ధికి ఆశాదీపాలు * బీమా రంగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది * బీమా రంగంలో 49 శాతం ఎఫ్డీఐలకు కృషి * ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2లక్షల కోట్ల పెట్టుబడులు * నల్లధనం దేశానికి శాపంగా మారింది * మధ్య తరగతి ప్రజల జీవితాలను మార్చటమే లక్ష్యం * గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు తగ్గిస్తాం * రెండేళ్లుగా ద్రవ్యోల్బణం వెంటాడుతోంది * అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది * ద్రవ్యలోటు 4.1 శాతానికి తీసుకు వస్తాం * అర్హులకే సబ్సీడీలు అందేలా చర్యలు * రక్షణ, బీమా రంగంలో 41 శాతం ఎఫ్డీఐ * రెండు,మూడేళ్లలో 7-8 శాతం వృద్ధిరేటు * 2015 ద్రవ్యలోటు 3.6 శాతం * భవిష్యత్ తరాలకు రుణభారాలు మిగల్చరాదు * అవసరానికి మించి ఖర్చులు చేయలేం * పన్ను వసూళ్లు మెరుగు పరచాలి * పన్ను, జీడీపీ రేటును పెంచాలి * అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ * బ్లాక్ మనీని అరికట్టేందుకు ప్రయత్నం * భారత్ మార్పు కోరుకుంటుంది * ఈ బడ్జెట్ నుంచి అతిగా ఆశించవద్దు * రానున్న కాలంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని భావిస్తున్నాం * గత ప్రభుత్వాల నిర్ణయాల్లో లోపాల వల్ల అవకాశాలు కోల్పోయం *దారిద్ర్య రేఖ నుంచి బయటకు రావటానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు టాగ్లు: budget-2014, Arun jaitley, finance minister, bjp government, narendra modi, బడ్జెట్-2014, అరుణ్ జైట్లీ, ఆర్థిక మంత్రి, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ

మరింత సమాచారం తెలుసుకోండి: