హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో మరో దారుణం జరిగింది. వరుసకు సోదరుడైన కామాంధుడు 20 యేళ్ళ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను పాల్పడటమే కాకుండా తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు. భల్లార్‌ఘర్‌లోని ఆర్య నగర్‌కు చెందిన 20 ఏళ్ల యువతి మార్కెట్ పనిపై ఇంటి నుంచి బయటకు రాగా అక్కడే కాపు కాసిన ఆమె సోదరుడు భూపేందర్, కూల్ డ్రింక్ తాగుదాం రమ్మంటూ పిలిచాడు. అయతే అందుకు స్పందించని యువతి ముందుకెళ్లగా, మరింత బలవంతపెట్టడంతో కాదనలేక అతడిచ్చిన కూల్ డ్రింక్ తాగింది. పథకం ప్రకారమే కూల్ డ్రింక్‌లో మత్తు పదార్థం కలిపిన భూపేందర్, డ్రింక్ తాగగానే మత్తు ఆవహించిన యువతిని కారులో వేసుకుని సమీపంలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ తిష్ట వేసిన అతడి మరో ఇద్దరు స్నేహితులు మోతీ, దీపులతో కలిసి భూపేందర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై ఫిర్యాదునందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: