జనసేన పేరుతో కొందరు విరాళాలు వసూలు చేస్తున్నారని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.ఆ విరాళాల వసూళ్లతో జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ కు సంబంధం లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది.సోషల్ మీడియాలో జనసేన సేరుతో కొందరు రుణాలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, జనసేన పార్టీ ఎక్కడా విరాళాల వసూలుకు పిలుపు ఇవ్వలేదని స్పష్టం చేసింది.కేంద్ర ఎన్నికల సంఘం నుంచి జనసేన పార్టీకి గుర్తింపు రాగానే భవిష్యత్తు కార్యాచరణపై పవన్ కళ్యాణ్ మాట్లాడతారని జనసేన పార్టీ ప్రకటించింది.జనసేన పేరుతో విరాళాలు వసూలు చేస్తున్నదెవరో గుర్తించి వారిపై కేసు పెడితే సరిపోతుందిగదా!

మరింత సమాచారం తెలుసుకోండి: