తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మీడియా వారికి విందు ఇచ్చారు. ఆ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిదులందరితో కలివిడిగా మాట్లాడారు. మీడియా వారు అడిగిన ప్రశ్నలకు ఆయన సరదాగా సమాధానాలు ఇచ్చారు. ప్రధానంగా స్థానికత,ఫీజు రీయింబర్స్ మెంట్ , ఐటి, తదితర అంశాలపై అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చారు. ఫీజ్ రీయింబర్స్ మెంట్ స్కీమ్ లో కోట్ల రూపాయలు ఎలా వృదా అవుతున్నది ఆయన వివరించారు. మీడియాతో ఆయన వ్యవహరించిన తీరు గతంలో తెలంగాణ ఉద్యమ నేతగా ఎలా ఉన్నారో, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడినట్లు అనిపించింది. అనేక విషయాలపై ఆయన లో స్పష్టత ఉన్న విషయం ఆయనతో మాట్లాడిన సందర్భంలో కనిపించింది.రుణ మాఫీ తదితర స్కీములు అన్నిటికి అయ్యే వ్యయం, ప్రభుత్వ రెవెన్యూ గురించి కూడా ఆయన వివరంగా తెలిపారు.మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి,ఎమ్.పి కేశవరావు ప్రభృతులు కూడా హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: