ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణానికి విరాళాలు సేకరించేందుకు ఏపీ సచివాలయంలో హుండీలు ఏర్పాటు చేశారు. మొత్తం మూడు హుండీల ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. మొదటి హుండీని సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లో ఏర్పాటు చేయగా, రెండవ హుండీని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో, మరొక హుండీ ముఖ్యమంత్రి నివాసం వద్ద ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆరడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన స్టీల్ హుండీపై ఏపీ చిహ్నంతో పాటు, రాజధాని నిర్మాణం కోసం విరాళాలు ఇవ్వాలనే అభ్యర్థన రాసి ఉంచారు. హుండీ ఏర్పాటుపై ఏపీ ఉద్యోగుల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: