ఢిల్లీ నుంచి యశ్వంత్పూర్ వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు స్వల్ప ప్రమాదానికి గురైంది. హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఉప్పుగూడ ప్రాంతంలో రైలు రెండుగా విడిపోయింది. దీంతో ఎస్7 బోగీ దెబ్బతింది. ఒక్కసారిగా అనుకోకుండా ఈ సంఘటన జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే రైలు విడిపోవడానికి కారణాలేంటన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: