ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ నాయుడుకు కార్యాలయం సిద్ధమవుతోంది. ఎన్నికల తరువాత రోజు పార్టీ కార్యాలయానికి వస్తున్న లోకేష్ తన కోసం తాజాగా పూర్తి స్థాయి కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో లోకేష్ నాయుడు పనులు ప్రారంభించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పార్టీ కార్యాలయంలో మకాం వేస్తున్నారు. వివిధ పనుల కోసం వస్తున్న కార్యకర్తలు, నాయకులను ఆయన కలుస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో పార్టీ కార్యక్రమాలపై లోకేష్ దృష్టి సారించారు. పార్టీ బలోపేతం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్న అంశంపై ఆయన దృష్టి సారించారు. తెలంగాణలోని ముఖ్యమైన నేతలతో విడివిడిగా చర్చలు జరుపుతున్నారు. పార్టీ కార్యాలయంలోని రెండో అంతస్థులో చంద్రబాబు నాయుడు ఛాంబర్‌కు ఎదురుగా లోకేష్‌కు గది కేటాయించారు. గతంలో ఈ గదిని టీడీపీ నేత నామా నాగేశ్వరరావుకు కేటాయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: