మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో గాయపడ్డ వారిని పరామర్శించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు యశోదా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ పది మందికి పైగా చికిత్స పొందుతున్నారు. అక్కడ చిన్నారులను చూసి కెసిఆర్ ఆవేదనకు గురి అయ్యారు. వారికి పూర్తి స్థాయిలో చికిత్స అందించాలని ఆయన డాక్టర్లను కోరారు.పిల్లలను బతికించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన డాక్టర్లను కోరారు. కాగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ కూడా ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాద వివరాలు తెలుసుకుని ఆయన బాధితులను పరామర్శించారు. కాగా బిజెపి తెలంగాణ అద్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఘటన స్థలికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: