జగన్ మోహన్ రెడ్డికి పురాణాలు తెలుసా? ఇది తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేసిన ప్రశ్న. ప్రస్తుతం కనీసం ఎమ్మెల్సీ పదవినైనా సొంతం చేసుకోవాలనే తపనతో ఉన్న చంద్రమోహన్ రెడ్డి గతంలోలాగానే జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతూ ఈ ప్రశ్న వేశాడు. దీనిపై జగన్ ఫ్యాన్స్ ఒక సెటైర్ వేశారు.. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఇది తెగషేర్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేతను టార్గెట్ చేసిన ఆ పోస్టు ఇలా ఉంది....
జగన్ కి పురాణాల గురించి తెలుసా !?--సోమిరెడ్డి !
ఎంత మాటా !?
మరిచిపోయినా మరుపొచ్చే పురాణాలటండీ ఇవి ?
(1) కమ్యూనిష్టులు రాసిన "బాబు జమానా అవినీతి ఖజానా" !
(2) దగ్గుపాటి వెంకటేశ్వర్రావు రాసిన "ఒక చరిత్ర కొన్ని నిజాలు"!
(3) బాబుగారు స్వయంగా రాసుకున్న "మనసులో మాట"!
(4) బాబుగారి నూరు తప్పుల గురించి అప్పట్లో BJP విడుదల చేసిన "ఉదయకమలం" !
(5) 1998 లో BJP రాసిన మరో బాబుగారి పురాణం "అన్నదాత హంతకులెవరు?"!
(6) 1997 లో బాబుగారి మహత్యం గురించి BJP రాసిన "రెండేల్ల చంద్రజాలం" !
(7) BJP రాసిన "అవినీతి ఏరులై పారిన ఏలేరు స్కాం" !
(8) తెహెల్కా చెప్పిన బాబుగారి పురాణం !
ఈ అష్ట దరిద్రపు పురాణాలు మాకెందుకు తెలియవు బాబయ్యా ?
మా సంగతి సరే కానీ,,ఇంతకీ తమరికీ పురాణాలు గుర్తున్నాయా బాబయ్యా !?
మరింత సమాచారం తెలుసుకోండి: