ఓ రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు గానీ, అసలు ప్రతి పక్ష పార్టీకి ఉండాల్సిన లక్షణాలు గానీ వైఎస్సార్‌సీపీ పార్టీకి లేవని ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుణ మాఫీకి సంబంధించి జగన్ చేస్తున్న తప్పుడు ప్రచారం, దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలను టిడిపి పట్టించుకోదని ఆయన అన్నారు.  రుణ మాఫీ ద్వారా రైతులను ఆదుకుని ఆత్మహత్యల నుండి వారిని ఆదుకున్న ఘనత టిడిపిదేనని యనమన అన్నారు. వ్యవయాసాన్ని లాభసాటి చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి పేర్కొన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా టిడిపి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: