ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా ప్రతిపక్ష నేతగానే భావిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని పిసిసి మాజీ అద్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తాను చేసిన వాగ్దానాలను తీర్చలేక ,ప్రజల దృష్టిని వాటినుంచి మళ్లించడానికి చంద్రబాబు తంటాలు పడుతున్నారని ఆయన అన్నారు. జలయజ్ఞం లో అవకతవకలు జరిగితే ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు దానికి బాద్యులపై చర్య తీసుకోవచ్చు కదా అని బొత్స అన్నారు. కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ ఇంకా చంద్రబాబు ప్రతిపక్ష నేతగానే మాట్లాడుతున్నారని , శ్వేతపత్రాల పేరుతో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.దీనిద్వారా సానుభూతి పొందాలని చంద్రబాబు చూస్తున్నారని, ఎక్కువకాలం ఇది సాగదని బొత్స వ్యాఖ్యానించారు.బొత్స చెప్పినట్లు చంద్రబాబు ఇంకా ప్రతిపక్ష నేతలాగానే మాట్లాడుతున్నారా!

మరింత సమాచారం తెలుసుకోండి: