టీడీపీ నేత, ఆర్‌ఓసీ (రీ ఆర్గనైజింగ్ కమిటీ) వ్యవస్థాపకుల్లో ఒకరైన పోతుల సురేష్‌ను అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. పట్టణంలోని శివనగర్ సమీపంలోనున్న బిన్ని మిల్స్‌లో పోతుల సురేష్ అనుచరులతో కలిసి ఉండగా అటువైపు వెళ్లిన ఎస్‌ఐ శ్రీరామ్.. ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకుండా దురుసుగా ప్రవర్తించడంతో సురేష్‌తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: