ఆంధ్రాసీఎం చంద్రబాబు కొడుకు లోకేశ్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. ఈమధ్య పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టిన లోకేశ్ ఫుట్ టైమ్ పార్టీ కోసమే వెచ్చిస్తున్నారు. పార్టీ పై పట్టు సాధించి వచ్చే ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎదగాలన్నది ఆయన కృషి వెనుక అంతరార్ధమని ఇప్పటికే పార్టీ వర్గాలు ఓ అభిప్రాయానికి వచ్చేశాయి. అలాంటి లోకేశ్ హఠాత్తుగా ఢిల్లీ టూర్ వేయడం వెనుక ఏమైఉంటుందని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. టీడీపీలో పార్టీకి సంబంధించిన ఏ విషయానికైనా పబ్లిసిటీ గురించి తగిన జాగ్ర్తత్తలు తీసుకుంటారు. అలాంటిది లోకేశ్ టూర్ గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అందులోనూ ఈ టూర్ పూర్తిగా వ్యక్తిగతమని ప్రకటించడంతో ఆసక్తి మరింత పెరిగింది. బయటకు చెప్పలేని పనులు ఢిల్లీలో లోకేశ్ కు ఏమేం ఉండొచ్చన్న అంశంపై ఊహాగానాలు బయలుదేరాయి. మొత్తానికి లోకేశ్ ఢిల్లీటూర్ సీక్రెట్ ఏంటో మెల్లగా బయటపడింది. ఎన్టీఆర్ పేరు మీద ఓ భారీ మ్యూజియం ఏర్పాటు చేయాలని టీడీపీ ప్లాన్ చేస్తోందట. దీన్ని ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ఏర్పాటు చేస్తారట. దీని కోసం 10 కోట్ల రూపాయలు వెచ్చించాలని ఇప్పటికే డిసైడ్ చేశారట. దీనికి సంబంధించిన పనుల కోసమే లోకేశ్ డిల్లీ వెళ్లారట. ఢిల్లీలోని ప్రముఖుల మ్యూజియాలను సందర్శించి.. ఎన్టీఆర్ మ్యూజియం పై ఓ ప్లాన్ రూపొందించే పనిలో ఉన్నారట. మరి ఇదే నిజమైతే టీడీపీ మీడియాకు ముందే చెప్పి ఉండేదే. అందులో దాచేదేముంది.. ఇంతకీ లోకేశ్ ఈ పనిమీదే ఢిల్లీ వెళ్లారా.. లేక వెనుక ఇంకేమైనా సీక్రెట్టుందా.. వెయిట్ అండ్ సీ..

మరింత సమాచారం తెలుసుకోండి: