ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నదంతా మోసమేనని మాజీ మంత్రి. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జాబు కావాలంటే బాబు రావాలన్నారు గానీ ఆయన ఇచ్చిన జాబులు ఏమీ లేకపోగా తేసేసిన ఉద్యోగాలే ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. ఇప్పటికైనా తెలుగుదేశం వైఫల్యాల మీద భారతీయ జనతా పార్టీ నిలదీయాల్సిన సమయం వచ్చిందని అన్నారు.తెలంగాణలో సర్వే పేరుతో సంక్షేమ పథకాలకు తూట్లు పొడిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. శనివారం విశాఖపట్నంలో చంద్రబాబు ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రాలపై కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ (2004 నుంచి 2014) వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, మహిళలకు ఎంతో మేలు చేసిందని చెప్పారు. తమ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఇన్‌పు‌ట్ సబ్సిడీ సకాలంలో ఇచ్చామని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ఇచ్చిన రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని కన్నా డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: