మాజీ మంత్రి సి.రామచంద్రయ్య రాజధానికి సంబందించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. విజయవాద ప్రాంతం కులం కారణంగానే అబివృద్ది చెందలేదని ఆయన అనడం విశేషం.విజయవాడను ఏకపక్షంగా రాజధానిగా ఎంపిక చేశారని కాంగ్రెస్ ఇప్పటికే విమర్శిస్తోంది.దీనిపై హైదరబాబాద్ లో జరిగిన ఒక సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.విజయవాడను ప్రభుత్వం అందరితో మాట్లాడకుండా ఎంపిక చేసిందని కొందరు విమర్శించారు. కాగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత మైసూరారెడ్డి ఏకపక్షంగా రాజధానిని ఎంపిక చేయడంవల్ల సమస్యలు వస్తాయని, రాయలసీమలో ప్రత్యేక ఉద్యమం వచ్చే ఆస్కారం ఉందని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: