కలర్ ఫుల్ ఈవెంట్స్ కు ఇప్పుడు కచ్చితమైన గెస్ట్ కేటీఆర్, హైదరాబాద్ పరిధిలో జరిగే ప్రతి పేజ్ త్రీ ఈవెంట్ కూ కేటీఆర్ ఒక కంపల్సరీ గెస్ట్. అది ఆంధ్రోళ్ల ప్రోగ్రామా.. తెలంగాణ వాళ్ల ప్రోగ్రామా.. ఐటీ సెక్టార్ వాళ్ల ప్రోగ్రామా.. అనేది పాయింట్ కాదు. ప్రతి ఈవెంట్ లోనూ కేటీఆర్ కచ్చితంగా కనిపిస్తుండటమే ఇక్కడ విశేషం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ శాఖ మినిస్టర్ అయిన కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఇప్పుడు హైదరాబాద్ రేంజ్ లో చక్రం తిప్పుతున్నాడు. సెలబ్రిటీగా చెలామణి అవుతున్నాడు. ప్రముఖుల ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యాలకు, ఇతర ఫంక్షన్లకు, ఇక మాదాపూర్ , కొండాపూర్ , గచ్చిబౌలీ ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు నిర్వహించుకొనే కార్యక్రమాల్లో కేటీఆర్ కచ్చితంగా కనిపిస్తున్నాడు. టీఆర్ఎస్ తరపున ఈ కార్యక్రమాల్లో మరెవరూ కనిపించకపోవడం కూడా విశేషమే. సుబ్బరామిరెడ్డి మనవడి నిశ్చితార్థం జరిగితే అక్కడ అన్ని పార్టీలకు చెందిన నేతలూ అనేక మంది కనిపించారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి తరపు నుంచి కేటీఆర్ మాత్రమే హాజరయ్యాడు. మరి ఎవరికీ పిలుపులు దక్కలేదో ఏమో కానీ... ఎవ్వరూ రాలేదు. ఇక ఐటీ శాఖ మంత్రిగా సాఫ్ట్ వేర్ లతోనూ మంచి సత్సంబంధాలు మెయింటెయిన్ చేస్తున్నాడీయన. వయసులో కూడా యువకుడే కాబట్టి.. వాళ్లతో కలిసిపోవడానికి అవకాశం దొరకుతోంది. ఓవరాల్ గా తెలంగాణ వచ్చాకా , టీఆర్ ఎస్ గవర్నమెంట్ ఏర్పడ్డాకా కేటీఆర్ గ్లామర్ అమాంతం పెరిగిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి తనయుడిగా, తెలంగాణ మంత్రిగా ఆయన గ్లామర్ కలిగి ఉన్నాడు. ఫలితంగా సెలబ్రిటీ హోదా వచ్చింది. మర ఐదేళ్ల వరకూ ఈ హోదాకు తిరుగులేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: