హైదరాబాద్లోఈ అసెంబ్లీ సమావేశాలే చివరవి కావొచ్చని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. వచ్చే సమావేశాలు విజయవాడలో నిర్వహించడానికి ఏర్పాటు చేస్తామని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. స్పీకర్ ఈరోజు అసెంబ్లీ సమావేశాల వాయిదా అనంతరం మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. మరోవైపు హైదరాబాద్ నుంచి విజయవాడకు వివిధ ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారు. ఇప్పటికే పలు కార్యాలయాలు బెజవాడ కేంద్రంగా పనిచేస్తున్నారు. కాగా మరో మూడేళ్లలో పాలన మొత్తం బెజవాడ నుంచి కొనసాగుతుందని మంత్రి నారాయణ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: