తెలంగాణ ప్రభుత్వ చరిత్రలో నిలిచిపోనున్న రోజు నేటి ఆగస్టు 19. సామాజిక, ఆర్థిక, సంక్షేమ, ఆరోగ్య, మౌలిక వసతుల స్థితిగతుల పై నేడు సమగ్ర సర్వే నిర్వహిస్తుండడమే అందుకు కారణం. కేంద్రంతోపాటు దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇలాంటి సర్వే గతంలో నిర్వహించలేదు. సుమారు కోటి కుటుంబాల సమాచారాన్ని ఒకేరోజు రాష్ట్ర ప్రభుత్వం సేకరించనుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సర్వే కోసం లక్షల మంది ఎన్యుమరేటర్లు పని చేస్తున్నారు. అత్యధిక కుటుంబాలు హైదరాబాద్ జిల్లాలో ఉండగా... అతి తక్కువ ఫ్యామిలీలు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి.
జనాభా లెక్కల ప్రకారం కుటుంబాల సంఖ్య : 86, 85,000
ప్రస్తుత సర్వే కోసం నమోదైన వాటి సంఖ్య : 99,41,000
సర్వేలో నిర్వహించే ఎన్యుమరేటర్ల సంఖ్య : 3,69, 729
సర్వే కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు మొత్తం రూ. : 20,00,00,000
హైదరాబాద్ జిల్లాలోని కుటుంబాల సంఖ్య : 20,00,000
నల్గొండ జిల్లాలోని కుటుంబాల సంఖ్య : 10,42,000
వరంగల్ జిల్లాలోని కుటుంబాల సంఖ్య : 10,15,000
కరీంనగర్ జిల్లాలోని కుటుంబాల సంఖ్య : 9,86,000
మహబూబ్ నగర్ జిల్లాలోని కుటుంబాల సంఖ్య : 9,74,000
ఖమ్మం జిల్లాలోని కుటుంబాల సంఖ్య : 8,77,000
రంగారెడ్డి జిల్లాలోని కుటుంబాల సంఖ్య : 7,89,000
మెదక్ జిల్లాలోని కుటుంబాల సంఖ్య : 7,61,000
ఆదిలాబాద్ జిల్లాలోని కుటుంబాల సంఖ్య : 7,47,000
నిజామాబాద్ జిల్లాలోని కుటుంబాల సంఖ్య : 7,05,000
సర్వే పత్రంలోని మొత్తం పేజీల సంఖ్య : 9
సర్వే పత్రంలోని మొత్తం అంశాల సంఖ్య : 101
సర్వే పత్రంలో అందరికీ వర్తించే వాటి సంఖ్య : 18
సర్వేలో ఆధారాలు చూపాల్సిన అంశాల సంఖ్య : 11
నిరంతరాయంగా సర్వే జరిగే సమయం గంటలు : 13
మరింత సమాచారం తెలుసుకోండి: