తొలి వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.14 వేల కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్‌ రూపుదిద్దుకుంది. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ 62శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారన్నారు. *జాతీయ వ్యవసాయ విస్తరణ సాంకేతిక మిషన్‌కు రూ.62 కోట్లు *జాతీయ ఆహారభద్రతా మిషన్‌లో...ముతకధాన్యాలు, వాణిజ్యపంటలు చేర్పు *3.6లక్షల హెక్టార్లు లక్ష్యంగా రూ.153 కోట్లు కేటాయింపు *జాతీయ నూనెగింజలు, ఆయిల్‌ఫాం మిషన్లకు రూ.59 కోట్లు *రాష్ట్రీయ కృషి వికాస్‌యోజన పథకం ద్వారా అనుబంధ శాఖలకు కేంద్ర ప్రభుత్వం రూ.230 కోట్లు *వర్షాధార ప్రాంతాల అభివృద్ధి కోసం రూ.169 కోట్లు *ఎన్జీరంగా విశ్వవిద్యాలయంలో ఏపీలో ఏర్పాటుకు కేంద్రం ఆమోదం, రూ.50 కోట్లు కేటాయించింది *దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.192 కోట్లు కేటాయింపు *వాటర్ మేనేజ్‌మెంట్, బిందుసేద్యానికి రూ.348 కోట్లు * వైఎస్ఆర్ హార్టికల్చర్ వర్సిటీకి కేంద్రం నుంచి రూ.30 కోట్లు *పట్టుపరిశ్రమకు రూ.122 కోట్లు *పశుసంవర్ధక శాఖకు రూ.723 కోట్లు *మత్స్యశాఖకు రూ.60 కోట్లు *ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీకి రూ.112 కోట్లు *సహకార శాఖకు రూ.156 కోట్లు *రైతులకు 7 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌కు నిర్ణయం *దీనిని 9 గంటలు పెంచేందుకు కృషిచేస్తాం *ఉచిత విద్యుత్‌కు రూ.3188 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి: