కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం ఉప ఎన్నికలలో దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ కుమార్తె తంగిరాల సౌమ్య శుక్రవారం నామినేషన్ దాఖలు చేసారు. కాగా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ మరణం తర్వాత ఖాళీ అయిన ఆ స్థానానికి ఇప్పుడు మరలా ఉప ఎన్నికలను నిర్వహిస్తున్న నేపధ్యంలో అతని కుమార్తె సౌమ్య తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఇక సౌమ్య నామినేషన్ కార్యక్రమానికి స్థానిక తెలుగుదేశం కార్యాలయం నుండి భారీ ర్యాలీగా కార్యకర్తలు, నేతలు తహసిల్దార్ కార్యాలయానికి తరలి వెళ్లారు. అటుపై సౌమ్య రిటర్నింగ్ అధికారి రజనీకాంతరావుకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పలువురు ఎంపీలు, తెలుగుదేశం నేతలు పాలుపంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: