మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో మధ్యప్రదేశ్ లో బీజేపీ నాయకుడితో సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉజ్జయినిలో ఈ ఉదంతం వెలుగుచూసింది. అసోంలోని డోయ్పాంగ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి- ముంబైలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 15 ఏళ్ల బాలికను మోసగించాడు. అత్యాచారం చేసి ఆమెను మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో తీసుకువచ్చాడు. అక్కడ ముంతాజ్ అనే ఏజెంట్ కు ఆమెను అమ్మేశాడు. తర్వాత బాలికను రూ.4 వేలకు నలుగురు వ్యక్తులకు ముంతాజ్ అమ్మేసింది. ఈ నలుగురు బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికంగా వేధించినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో అరెస్టైన నిందితుల్లో బీజేపీ నాయకుడు హమీద్ సాదర్ కూడా ఉన్నారు. నిందితులపై మనుషుల అక్రమ రవాణా, అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: