ఖమ్మం జిల్లాల్లో వైయస్ జగన్ షాక్ తప్పేట్లు లేదు. జిల్లా నుంచి మరో ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరేందుకు సిద్ధమయ్యా రు. అంతేకాదు వైసిపి పార్టీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ సైతం తెరాసలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపధ్యంలోనే మంగళవారం మదన్‌లాల్‌ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన నివాసంలో కలిసి పార్టీలో చేరేందుకు తన సుముఖతను వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లో పార్టీలో చేరేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. దీనికి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించి నట్లు తెలుస్తోంది. నేడో రేపో మదన్ లాల్ తెరాసలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు కూడా తెరాసలో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత తుమ్మల నాగేశ్వర్‌రావు కారెక్కేందుకు సిద్ధమయ్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: