గత నాలుగు రోజులుగా టమోటా ధర తగ్గుముఖం పట్టడంతో ఈ ప్రాంతంలో సాగుచేసిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లా ములకల చెరువు మార్కెట్ యార్డులో గత పది రోజుల క్రితం టమోటా కిలో ధర 40 రూపాయలు పలికింది. దీంతో మండలంలోని రైతులు వేల ఎకరాల్లో టమోటా పంట విక్రయానికి తెచ్చారు. అయితే ఉన్నట్టుండి ధర తగ్గడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. స్థానిక మార్కెట్ యార్డులో గురువారం మొదటి రకం 30 కిలోల బాక్సు ధర 300, రెండో రకం ధర 200 రూపాయలు పలికింది. ఈ మార్కెట్‌కు ములకలచెరువు, పెద్దతిప్పసముద్రనం, కందుకూరు, పులికల్లు, టి.సదుం, చేలూరు పక్కనే ఉన్న అనంతపురం జిల్లా నుండి కొక్కంటిక్రాస్, తకనల్లు, నల్లచెరువు, చీకటిమానిపల్లె తదితర ప్రాంతాల నుంచి రైతులు తీసుకువస్తారు. అయితే ధర లేకపోవడంతో గిట్టుబాటుకాక రైతులు రోడ్డుపై పారబోసి పశువులకు మేతగా టమోటాలను వదిలేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: