తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తో ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ నేత తుమ్మల నాగేశ్వర రావు భేటీ అయ్యారు. కెసీఆర్ తో తుమ్మల నాగేశ్వర రావు 15 నిమిషాల పాటు చర్చించారు. తుమ్మల నాగేశ్వర రావు సెప్టెంబర్ మొదటివారంలో టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకొనున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు ఇప్పటికే ఖమ్మం జిల్లా వైరాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి ఎమ్మెల్యే మదన్ లాల్ గులాబి కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు. అంతేకాకుండా, మరో ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి చెందిన ఎమ్మెల్యేలు కారేక్కేందుకు సన్నాహాలు చేసుకున్తున్నట్టు ఇప్పటికే సమాచారం. వీరితోపాటు, ఖమ్మం జిల్లా ఇల్లందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోరం కనకయ్య గులాబిదళంలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఖమ్మం జిల్లాలో కారు తన షెడ్డును ఏర్పాటు చేసుకునేందుకు పావులు కదుపుతున్నది. అంతేకాకుండా, ఆ జిల్లాలో క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టిని బలపరచాలంటే, బలమైన నాయకులు అవసరమని భావించిన గులాబిదళపతి అక్కడ బలమైన నాయకులను ఆకర్షించేదుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: