వివేకానందనగర్ బస్స్టాప్ వద్ద దారణం చోటు చేసుకుంది. బస్స్టాప్లో మహిళపై దుండగులు దాడి చేశారు. అనంతరం ఆమె గొంతుకోసి హత్య చేశారు. దాంతో ఆమె రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: