దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయిదవ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ సతీమణి విజయమ్మ, కుమారుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి,అతని సతీమణి భారతి, వైఎస్సార్ కుమార్తె షర్మిల మరియు ఇతర కుటుంబ సభ్యులు రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద అంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు.  ఇక వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పులివెందులలో వైకాపా నేతలు ప్రత్యేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అలాగే ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ ను ప్రత్యేకంగా అలంకరించి, సందర్శనార్ధం వచ్చే అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేసారు. ఇక కుటుంబసభ్యులంతా నివాళులు అర్పించిన అనంతరం ప్రత్యేక ప్రార్ధనలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: