మెదక్ ఉప ఎన్నికలలో పంచడానికి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అద్యక్షుడు చంద్రబాబు నాయుడు డబ్బు పంపారని టిఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావు ఆరోపించారు. శామీర్ పేట వద్ద డబ్బు పట్టుబడిన నేపధ్యంలో హరీష్ రావు ఈ ఆరోపణ చేస్తూ టిడిపి కోట్లు వెదజల్లుతోందని అన్నారు. పోలీసులు డబ్బు స్వాధీనం చేసుకోగానే తెలుగుదేశం ఎమ్మెల్యే ధర్మారెడ్డి, గజ్వేల్ టిడిపి నేత ప్రతాపరెడ్డి కార్లు వదలి పరారయ్యారని హరీష్ రావు అన్నారు. ప్రతాపరెడ్డి కారులో డబ్బు దొరికిందని ఆయన చెప్పారు. సిసి కెమేరాల ఫుటేజీ పరిశీలించి పోలీసులు కేసును విచారించాలని, నిందితులను అరెస్టు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.కాగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలను ఎవరూ పట్టించుకోలేదని ,పిసిసి అద్యక్షుడు ఓ విఫల సారధి అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: