ఇటీవల కన్నుముూసిన ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు పేరును 'పద్మ విభూషణ్' పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫారసు చేయనుంది. రెండు రోజుల కిందట 'పద్మ' పురస్కారాలకు పేర్ల ప్రతిపాదనలపై సమావేశం నిర్వహించిన ప్రభుత్వం, జాబితా కోసం కొన్ని పేర్లను సిద్ధం చేసిందట. ఈరోజు 'పద్మ' పురస్కారాలకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. బాపుతో బాటు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, విఖ్యాత గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ రాజ్ రెడ్డి పేర్లను 'పద్మవిభూషణ్' కు... ఆధ్యాత్మిక ఉపన్యాసకులు చాగంటి కోటేశ్వరరావు, శాస్త్రీయ సంగీత విద్వాంసులు నేదునూరి కృష్ణమూరి, ప్రముఖ సినీనటులు, ఎంపీ మురళీమోహన్ పేర్లను 'పద్మభూషణ్' కోసం సిఫారసు చేస్తుందట. ఇక 'పద్మశ్రీ' పురస్కారం జాబితాలో సినీ నటుడు కోట శ్రీనివాసరావు తదితర ప్రముఖుల పేర్లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: